హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీర్మానం కరీంనగర్‌లో కాదు మహానాడులో: హరీష్‌ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్మానం చేయాల్సింది కరీంనగర్ సభలో కాదని తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో అని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం సూచించారు. పార్టీ అధికారికంగా తెలంగాణపై తీర్మానం చేయకుండా తెలంగాణ ప్రాంతంలో టిడిపి ఎన్ని సభలు, ఎన్ని సమావేశాలు నిర్వహించినా ఫలితం ఉండదన్నారు. మహానాడులో తీర్మానం చేసిన తర్వాత సభలు, సమావేశాలు ఎన్ని పెట్టినా ప్రజలు, తాము స్వాగతిస్తామని చెప్పారు.

కేంద్రమంత్రి చిదంబరానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణ తీర్మానం లేఖ ఇవ్వాల్సిందే అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సార్సీ, అఖిల పక్ష సమావేశాలు అంటూ తెలంగాణపై కాలాయాపన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

English summary
TRS MLA Harish Rao demanded Telugudesam party to propose Telangana resolution in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X