వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు చేయి నరికిన రెవెన్యూ కార్యదర్సి, తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

By Pratap
|
Google Oneindia TeluguNews

East Godavari
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఓ రెవెన్యూ ఉద్యోగి రైతుపై దారుణానికి పాల్పడ్డాడు. రెవెన్యూ కార్యదర్శి తొల్లంగి సత్యనారాయణ మోహన్ అనే రైతు చేయి నరికాడు. పన్ను కట్టలేదనే కోపంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారంనాడు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలో జరిగింది. పన్ను కట్టని మోహన్‌ను సత్యనారాయణ తన కార్యాలయానికి పిలిపించాడు. తన ధాన్యం అమ్ముడో పోలేదని, అమ్ముడు పోయిన తర్వాత కడతానని మోహన్ చెప్పాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది.

రైతు వాదనకు ఆగ్రహం చెందిన సత్యనారాయణ ఉపాధి హామీ పథకం కూలీల వద్ద ఉన్న కత్తిని తీసుకుని మోహన్ చేయి నరికాడు. అప్పటికే సత్యనారాయణ మద్యం సేవించి, మత్తులో తూలుతున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదు. రెవెన్యూ అధికారులు సత్యనారాయణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణను కూడా అస్పత్రికి తరలించి కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

English summary
A Revenue secretary chopped farmer's hand at K Pedapudi village of East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X