వైయస్సార్ కాంగ్రెసులో రోజాకు పెద్దపీట, విజయమ్మ గౌరవాధ్యక్షురాలు
సోమయాజులు, సిసి రెడ్డిని పార్టీ సలహాదారులుగా వేసుకున్నారు. పిఎన్వి ప్రసాద్ రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఏడుగురు అధికార ప్రతినిధులను నియమించారు. రెహ్మాన్, జూపూడి ప్రభాకర రావు, బాజిరెడ్డి గోవర్ధన్, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, రోజా, గట్టు రామచంద్రరావు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. మహిళా అధ్యక్షురాలిగా నిర్మలకుమారి ఎంపికయ్యారు. రాష్ట్ర యువజన నాయకుడిగా గుత్తా ప్రభాత్ రెడ్డిని వేశారు. విద్యార్థి విభాగం నాయకుడిగా మద్దినేని అజయ్ ఎంపికయ్యారు.
సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు - కొణతాల రామకృష్ణ, వైవి సుబ్బారెడ్డి, రెహ్మాన్, మహేందర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, కంతి విశ్వనాథం, తోపుదుర్తి కవిత, గిరిరాజు నగేష్, బాజిరెడ్డి గోవర్ధన్, జ్యోతుల నెహ్రూ, సోమయాజులు, భూమా నాగిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, బాల మణెమ్మ, మూలింటి మారెప్ప, జంగ కృష్ణమూర్తి, మాకినేని పెదరత్తయ్య, మదన్ లాల్ నాయక్.
రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా జనార్దన్ రెడ్డి, నల్లగొండ జిల్లా కన్వీనర్గా సోమిరెడ్ిడి, నెల్రూరు జిల్లా కన్వీనర్గా గోవర్ధన్ రెడ్డి, విశాఖపట్నం అర్బన్ కన్వీనర్గా రవిరాజ్, విజయవాడ అర్బన్ కన్వీనర్గా జలీల్ ఖాన్, రాజమండ్రి అర్బన్ కన్వీనర్గా రాజ్ కపూర్ ఎంపికయ్యారు.