జగన్ పార్టీలో రెడ్లదే ఆధిపత్యం, నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి
కాగా, కమిటీల నియామకంపై వైయస్సార్ పార్టీలో అసంతృప్తి చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి తన వెంట ఉంటూ, కాంగ్రెసు పార్టీని ధిక్కరిస్తూ వస్తున్న అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, రాజ్ ఠాకూర్లకు తగిన ప్రాధాన్యం లభించలేదనే మాట వినిపిస్తోంది. అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు పాత్రను వైయస్ జగన్ కుదించారు. వారిని అధికార ప్రతినిధుల పాత్రకు మాత్రమే పరిమితం చేశారు. రోజాకు మహిళా అధ్యక్ష పదవిని అప్పగించలేదు. కానీ, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్లోకి ఆమెను తీసుకున్నారు. రాజ్ ఠాకూర్ను కరీంనగర్కే పరిమితం చేశారు.
కాంగ్రెసును ఎదిరించి నిలిచినవారిని పక్కన పెట్టి గత్యంతరం లేక పార్టీలోకి వచ్చివారికి వైయస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, నల్లగొండ జిల్లా కన్వీనర్గా సోమిరెడ్డిని నియమించడాన్ని రవీందర్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏమైనా, ఈ కమిటీల నియామకం ఎటు దారి తీస్తుందో చెప్పలేమని అంటున్నారు.