గవర్నర్ పదవిపై సోనియా గాంధీ నాతో మాట్లాడలేదు: రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: తనకు గవర్నర్ పదవి ఇచ్చే విషయంపై తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించలేదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు గవర్నర్ పదవి ఇవ్వడానికే తనను ఢిల్లీకి ఆహ్వానించారని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు. అయితే, సోనియాతో ప్రధానంగా ఇదే చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తనపై ఉన్న హైదరాబాదులోని అమీర్‌పేట భూముల కేసుపై మాట్లాడడానికి తాను ఢిల్లీ రాలేదని ఆయన చెప్పారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని, దానిపై మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య అమీర్‌పేటలోని విలువైన ప్రభుత్వ భూమిని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారనే ఆరోపణపై ఎసిబి కోర్టులో కేసు నడుస్తోంది.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా తనతో మాట్లాడారని, పార్టీ పరిస్థితిపై తాను రాసిన లేఖ అందిందని సోనియా తనతో చెప్పారని రోశయ్య అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)ని పునర్వ్యస్థీకరించాల్సిన అవసరం ఉందని సోనియా భావిస్తున్నారని, ఆ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాలనుకుంటే తానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాడినని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలూ వెల్లడించడానికి వీలు కాదని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడి నియామకం ఏ రోజు చేస్తారని తాను సోనియాను అడగలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై సోనియా తనతో మాట్లాడారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+