గవర్నర్ పదవిపై సోనియా గాంధీ నాతో మాట్లాడలేదు: రోశయ్య

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా తనతో మాట్లాడారని, పార్టీ పరిస్థితిపై తాను రాసిన లేఖ అందిందని సోనియా తనతో చెప్పారని రోశయ్య అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)ని పునర్వ్యస్థీకరించాల్సిన అవసరం ఉందని సోనియా భావిస్తున్నారని, ఆ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాలనుకుంటే తానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాడినని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలూ వెల్లడించడానికి వీలు కాదని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడి నియామకం ఏ రోజు చేస్తారని తాను సోనియాను అడగలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై సోనియా తనతో మాట్లాడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications