ఐప్యాడ్ దెబ్బకు విలవిలలాడుతున్న మిగతా కంపెనీల టాబ్లెట్ సేల్స్
శ్యాన్ ప్రాన్సికోకి చెందినటువంటి ఆపిల్ కంపెనీలో ఐప్యాడ్ 2 కోసం జనాభా బారులు తీరి ఉండడంతో ఐప్యాడ్ 2 ఎంత బాగా సక్సెస్ అయిందో ఇట్టే తెలిసిపోతుంది. ఆపిల్ కంపెనీకి వస్తున్నటువంటి జనాభా కోసం ఆపిల్ ఎంప్లాయస్ ఎవరు ముందు వస్తే వారికి వోచస్ ఇచ్చి 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పద్దతిని పాటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మే 28న ఆపిల్ కంపెనీ ఐప్యాడ్ 2ని ఆసియా దేశాలలో విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా ఆపిల్ ఐప్యాడ్ 2 మంచి సేల్స్ని నమోదు చేస్తుంది.
ఇక చైనాలోని అన్హూయి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఓ టీనేజర్ ఐప్యాడ్ 2 కొనుగోలు చేయడం కోసం తన కుడి కిడ్నీని అమ్మడం జరిగింది. పదహేడు సంవత్సరాలు వయసు కలిగినటువంటి 'జియా జింగ్' అనే టీనేజర్కి ఐప్యాడ్ 2 అంటే ప్రాణం. కానీ ఐప్యాడ్ 2 ధర మాత్రం తనకి అందనంత దూరంలో ఉండడంతో 'జియా జింగ్' తన కిడ్నీ అమ్మి ఆపిల్ ఐప్యాడ్ 2ని సోంతం చేసుకోవడం జరిగింది.
ఇక ఈ క్రింద ఫోటోలో మీకు కనిపిస్తుంది శ్యాన్ ప్రాన్సికోలో ఐప్యాడ్ 2 కోసం వేచిఉన్న కస్టమర్స్