జగన్! ఎందుకు ప్రభుత్వంపై కన్నెర చేయలేదు: చంద్రబాబు ప్రశ్న
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఇప్పటికైనా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గవర్నర్ వద్దకు వెళ్లి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వెంటనే శాసనసభను సమావేశపర్చాలని తాము గవర్నర్ను కోరినట్లు ఆయన తెలిపారు. శానససభ నడిచిన తీరుపై తాము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం, స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిట్లు ఆయన ఆరోపించారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని ఆయన విమర్శించారు. స్పీకర్ ఎన్నికతో బలనిరూపణ అయిందంటూ కప్పదాట్లు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రోటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి నిబంధనలను పాటించలేదని ఆయన విమర్శించారు.
Comments
chandrababu naidu telugudesam narasimhan assembly hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నరసింహన్ శాసనసభ హైదరాబాద్
English summary
TDP president N Chandrababu lashed out at YSR Congress party president YS Jagan.
Story first published: Saturday, June 4, 2011, 16:46 [IST]