హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ ఎన్నికపై ప్రభుత్వానికి ఓటమి భయం: టిడిపి నేత రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం శానససభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓడిపోతామనే భయంతోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుగుతుందని బులిటెన్ విడుదల చేశారని. ఇప్పుడు మనసు మార్చుకుని ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుందని చెబుతోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రజల మద్దతు కోల్పోయిందని, శానససభ్యుల మద్దతు కూడా కోల్పోయామని భయపడిన ప్రభుత్వం ఓటింగ్ విధానాన్ని మార్చారని ఆయన అన్నారు.

తమ స్పీకర్ అభ్యర్థి ఓడిపోతారని ప్రభుత్వం వెన్నులో చలి పుడుతోందని ఆయన అన్నారు. అలా చేస్తే ప్రభుత్వం నైతికంగా ఓడిపోయినట్లేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యుల తీరును తెలుగుదేశం మరో శానససభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు పట్టారు. వారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయం ముఖ్యమంత్రితో రాత్రి వైయస్ జగన్‌తో ఉంటున్నారని ఆయన అన్నారు.

English summary
TDP MLA Revanth Reddy lashed out at Government for changing voting pattern of speaker election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X