వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వాన్ని క్షమించాను: యోగా గురు బాబా రామ్దేవ్

ప్రజాస్వామ్యానికి తెచ్చిన మచ్చకు వారిని దేశ, ప్రపంచ చరిత్ర ఎన్నటికీ క్షమించదని ఆయన అన్నారు. తన పట్ల, తన అనుచరుల పట్ల జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఏ తప్పూ చేయకపోతే తమ కార్యకర్తల నుంచి సిసిటివీ ఫుటేజ్ను లాక్కుని ఉండేవారు కారని ఆయన అన్నారు. తమ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. పోలీసులు తమ అనుచరులను కొట్టి వెనక్కి పంపారని, పోలీసుల దాడిలో వేలాది మంది గాయపడ్డారని ఆయన అన్నారు. బాబా రామ్దేవ్ తన దీక్షను హరిద్వార్లో కొనసాగిస్తున్నారు.