హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వ్యాఖ్యలపై జైపాల్ రెడ్డిని సమర్థించిన కేశవరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె. కేశవరావు సమర్థించారు. జైపాల్ రెడ్డి మాట్లాడిన జాతీయవాదం, ప్రాంతీయవాదాలకు తెలంగాణతో సంబంధం లేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి ఆ మాటలను వేరే సందర్భాన్ని ఉద్దేశించి అన్నారని, తెలంగాణను ఉద్దేశించి అనలేదని, మీడియా జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌తో జైపాల్ రెడ్డి వ్యాఖ్యకు సంబంధం లేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ఏ విధమైన దాపరికాలు లేవని ఆయన అన్నారు. ప్రతి తెలంగాణ నాయకుడు తెలంగాణ కోసం పోరాడుతాడు, మాట్లాడుతాడని ఆయన అన్నారు.

తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, అంత మాత్రాన తెలంగాణపై మాట్లాడకూడదని ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు వేదవాక్కులు కావని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో అభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region leader K Keshav Rao has supported Union Minister S Jaipal reddy's remarks on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X