వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో జైతెలంగాణ అనిపిస్తా, ఆ తర్వాతే వస్తాం: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాను జై తెలంగాణ అనిపిస్తానని పరకాల శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన సాగునీరు ఆందోళన కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో కొండా సురేఖ పార్టీ కార్యకర్తలను, తెలంగాణవాదులను ఉద్దేశించి మాట్లాడారు. తాను జగన్‌తో ఖచ్చితంగా జై తెలంగాణ అనిపిస్తానని ఆమె చెప్పారు. జగన్‌తో తెలంగాణ అనిపించిన తర్వాతే తాము తెలంగాణలో పర్యటిస్తామని సురేఖ స్పష్టం చేశారు.

ప్లీనరీలో తెలంగాణపై చర్చించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చూస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగు భాషే సరిగా రాదు. అలాంటప్పుడు రైతు బాధ ఎలా తెస్తుందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నేతలకు దమ్ముంటే తనను పార్టీ నుండి బయటకు పంపించాలని సవాల్ విసిరారు. కాగా అంతకుముందు కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆందోలను అడ్డుకున్న విషయం తెలిసిందే. గతంలో కూడా జగన్ యాత్రను మహబూబ్‌నగర్‌లో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ దాడులనుండి తప్పించుకోవడానికే తెలంగాణపై నిర్ణయం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మాదిరి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Parakal MLA Konda Surekha said today that she will announcing Jai Telangana with YSR Congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X