హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ మధ్యలో వెళ్లిపోయిన హరికృష్ణ: అసంతృప్తి వ్యక్తం చేయడానికే వచ్చాడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మళ్లీ అలిగినట్లుగా కనిపిస్తోంది. మంగళవారం టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భపన్‌లో రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన మేథోమధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమానికి కాస్త హుషారుగానే వచ్చిన హరికృష్ణ మధ్యలోనే వెళ్లి పోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల్లో తీవ్ర ఆందోళన కలిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన అనంతరం కాసేపటికి హరికృష్ణ కార్యక్రమం నుండి అర్దాంతరంగా వెళ్లి పోయారు.

అయితే ఇటీవల మహానాడు కార్యక్రమంలో కూడా హరికృష్ణ మధ్యలోనే వెళ్లి పోయారు. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ కుమార్ వారసత్వ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య హరికృష్ణ తన బావ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. మహానాడులో టిడిపి నేతలు ఎంతగా మాట్లాడమని కోరినప్పటికీ హరికృష్ణ మాట్లాటక పోగా కార్యక్రమం నుండే వెళ్లిపోయారు. అయితే మేథోమధనం కార్యక్రమానికి హరికృష్ణ హాజరు కావడంతో విభేదాలకు స్వస్తీ పలికినట్టున్నారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కూడా మధ్యలోనే బయటకు వెళ్లడం టిడిపి నేతలను కలవరపరుస్తోంది. చంద్రబాబుపై తన అసంతృప్తిని హరికృష్ణ ఇలా వ్యక్త పరుస్తున్నాడా అనే అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం ఆ తర్వాత మధ్యలోనే వెళ్లి పోవడం ద్వారా చంద్రబాబుపై తనకున్న అసంతృప్తిని, పార్టీలో ఉన్న విభేదాలను బట్టబయలు పరుస్తున్నట్టుగా కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telugudesam party MP Nandamuri Harikrishna was again dropped from TDP workshop meeting today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X