మళ్లీ మధ్యలో వెళ్లిపోయిన హరికృష్ణ: అసంతృప్తి వ్యక్తం చేయడానికే వచ్చాడా?
అయితే ఇటీవల మహానాడు కార్యక్రమంలో కూడా హరికృష్ణ మధ్యలోనే వెళ్లి పోయారు. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ కుమార్ వారసత్వ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య హరికృష్ణ తన బావ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. మహానాడులో టిడిపి నేతలు ఎంతగా మాట్లాడమని కోరినప్పటికీ హరికృష్ణ మాట్లాటక పోగా కార్యక్రమం నుండే వెళ్లిపోయారు. అయితే మేథోమధనం కార్యక్రమానికి హరికృష్ణ హాజరు కావడంతో విభేదాలకు స్వస్తీ పలికినట్టున్నారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కూడా మధ్యలోనే బయటకు వెళ్లడం టిడిపి నేతలను కలవరపరుస్తోంది. చంద్రబాబుపై తన అసంతృప్తిని హరికృష్ణ ఇలా వ్యక్త పరుస్తున్నాడా అనే అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం ఆ తర్వాత మధ్యలోనే వెళ్లి పోవడం ద్వారా చంద్రబాబుపై తనకున్న అసంతృప్తిని, పార్టీలో ఉన్న విభేదాలను బట్టబయలు పరుస్తున్నట్టుగా కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.