మళ్లీ మధ్యలో వెళ్లిపోయిన హరికృష్ణ: అసంతృప్తి వ్యక్తం చేయడానికే వచ్చాడా?

అయితే ఇటీవల మహానాడు కార్యక్రమంలో కూడా హరికృష్ణ మధ్యలోనే వెళ్లి పోయారు. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ కుమార్ వారసత్వ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య హరికృష్ణ తన బావ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. మహానాడులో టిడిపి నేతలు ఎంతగా మాట్లాడమని కోరినప్పటికీ హరికృష్ణ మాట్లాటక పోగా కార్యక్రమం నుండే వెళ్లిపోయారు. అయితే మేథోమధనం కార్యక్రమానికి హరికృష్ణ హాజరు కావడంతో విభేదాలకు స్వస్తీ పలికినట్టున్నారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కూడా మధ్యలోనే బయటకు వెళ్లడం టిడిపి నేతలను కలవరపరుస్తోంది. చంద్రబాబుపై తన అసంతృప్తిని హరికృష్ణ ఇలా వ్యక్త పరుస్తున్నాడా అనే అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం ఆ తర్వాత మధ్యలోనే వెళ్లి పోవడం ద్వారా చంద్రబాబుపై తనకున్న అసంతృప్తిని, పార్టీలో ఉన్న విభేదాలను బట్టబయలు పరుస్తున్నట్టుగా కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications