ఖాళీ దొరికినప్పుడు ఓదారుస్తారా: వైయస్ జగన్‌పై బొత్స వ్యంగ్యాస్త్రం

Botsa Satyanaryana
హైదరాబాద్: మృతుల కుటుంబాలను ఎవరైనా తమకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓదారుస్తారా అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై వ్యంగ్యాస్త్రం విసిరారు. మృతుల కుటుంబాలను అప్పటికప్పుడు ఓదార్చాలే గానీ మనకు ఖాళీ దొరికినప్పుడు ఓదారుస్తామంటే, అది ఓదార్చడం ఎలా అవుతుందని ఆయన అన్నారు. ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే స్పీకర్‌కు కొంత మందిపై ఫిర్యాదు చేశామని, మరింత మందిపై ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తేనే పార్టీ బలంగా ఉంటుందని ఆయన అన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తనపై ఆరోపణలు చేయడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదని, హర్షకుమార్ తన అభిప్రాయం తాను చెప్పారని, బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని, అది మంచి సంప్రదాయమని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెళ్లిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అంగీకరించారు.

తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలపై వాస్తవ పరిస్థితిని తాను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయానికి తాము కట్టుబడుతామని ఆయన చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రం నుంచి అధిష్టానం ఐదుగురిని గుర్తించిందని, అందులో భాగంగానే తనకు పిసిసి అధ్యక్ష పదవి అప్పగించారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+