కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోర్టు ముందే భార్యపై కత్తితో దాడి: బావమరిదికి తీవ్రగాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: కోర్టు ముందే కత్తితో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి హైదరాబాదుకు చెందిన జయశ్రీని వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం అనంతరం రాజమౌళికి అంతకుముందే పెళ్లి అయిందన్న విషయం తెలుసుకున్న జయశ్రీ భర్తతో విడాకులను కోరుకుంది. అందుకు హైదరాబాదులోని తన సోదరుడు సహాయం తీసుకొని విడాకుల కోసం కరీంనగర్ కోర్టును ఆశ్రయించింది.

అంతకుముందే ఆయనకు పెళ్లయిన విషయం తనకు చెప్పలేదని స్పష్టం చేసింది. ఆమె హైదరాబాదులోనే తన సోదరుడి వద్ద ఉండిపోయింది. కోర్టు హాజరవ్వాల్సిన జయశ్రీ తన సోదరుడితో పాటు హైదరాబాదు నుండి కరీంనగర్ వచ్చింది. అయితే కోర్టుకు వచ్చిన జయశ్రీపై ఆమె భర్త రాజమౌళి కోర్టు ఎదురుగానే కత్తితో దాడి చేసి చంపడానికి యత్నించాడు. దీనిని జయశ్రీ సోదరుడు అడ్డుకున్నాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయమైంది.

English summary
Husband Rajamouli attacked on his wife Jayasri in Karimnagar district. Rajamouli made second marriger Jayasri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X