లగడపాటి పార్టీ నుండి వెళ్లిపో!: పొన్నం, మీడియాకు క్లాస్

సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమైన 4 పదవులు ఇచ్చినా తాము పార్టీని గౌరవిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ టి-కాంగ్రెసులో ద్రోహులు అన్న విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటే ఉండవచ్చునని అయితే వారిని కూడా ఉద్యమంలోకి లాగుతామని చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు. తాము ఇతర పార్టీలలాగా ఏకపక్షంగా వెళ్లడం లేదన్నారు. ఇతర ప్రాతాల వారి ఆమోదంతో, అధిష్టానం ఆమోదంతో తెలంగాణ సాధింపే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు లేవన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఓ దౌర్బాగ్య కమిటీ అన్నారు. పార్టీ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా లేకుంటే ప్రజాభిప్రాయం మేరకు నడుకుంటామని చెప్పారు. తెలంగాణ విషయంలో గూర్ఖాలాండ్ తరహా ఎలాంటి ప్యాకేజీలు తమకు అవసరం లేదన్నారు. తమపై పోటీ పెట్టనని టిఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు.
పొన్నం మీడియాకు కూడా క్లాస్ పీకారు. మీడియా టి-కాంగ్రెసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు అని, ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని అన్నారు. తెలంగాణకు తాము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం అని చెప్పారు. తమకు లోపల ఒకటి బయట ఒకటి లేదన్నారు. అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్లు మారవచ్చు, తేదీలు మారవచ్చు, కానీ తెలంగాణపై మా ఆకాంక్ష మాత్రం మారదన్నారు. ఓ సమయంలో ఆయన అందరికీ దండం పెడతా అని కూడా అన్నారు. తాము రాష్ట్ర పతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్పించామని, నల్లజెండాలతో పార్లమెంటుకు వెళ్లి నిరసన తెలిపామని గుర్తు చేశారు. కాగా పలువురు రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ రాక పోవడంపై వారు వివరణ ఇచ్చారని వారికి కూడా తెలంగాణ పట్ల సంఘీభావం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications