వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి-కాంగ్రెసుకు మళ్లీ ఎదురు దెబ్బ: తెలంగాణపై కోర్ కమిటీలో రాని చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు అధిష్టానం నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. శనివారం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చిస్తారని టి-కాంగ్రెసు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం నాటి తమ సమావేశానికి కొనసాగింపు అని కూడా చెప్పారు. అయితే వారు ఊహించినట్లుగా కోర్ కమిటీలో తెలంగాణపై చర్చ జరగనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా లోక్ పాల్ బిల్లు, ఆగస్టు 15నుండి ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించిన అన్నా హజారే, బాబా రామ్‌దేవ్ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

అయితే తెలంగాణ అంశంపై లేవనెత్తినప్పటికీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ లేనందున చర్చ జరగనట్లు తెలుస్తోంది. దీంతో మీడియా ముందు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వారికి నెలకొంది. మూడు రోజులుగా న్యూఢిల్లీలో మకాం వేసిన టి-కాంగ్రెసు నేతలకు అన్నీ ఎదురుదెబ్బలే. న్యూఢిల్లీ వెళ్లాక మొదట హోంమంత్రి చిదంబరంతో టి-కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. అయితే ఆయన వారిని నిరుత్సాహపరుస్తూ పది నిమిషాలలోనే తనకు మరో భేటీ ఉందంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రణబ్, ఆంటోనీ సమావేశాలలోనూ వారికి తెలంగాణపై హామీ లభించలేదు. సరికదా తెలంగాణ ప్రాంతీయ బోర్డు తెరపైకి వచ్చింది. దీంతో వారు నీరుగారి పోయారు.

English summary
Congress core committee give shock to T-congress leaders. They hoped that core committe talk about Telangana but they did not talk about issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X