హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నడమంత్రపు సిరితో ఎగిరి పడుతున్నాడు: చంద్రబాబు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ నడమంత్రపు సిరితో ఎగిరి పడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో ఆయన సోమవారం ప్రసంగించారు. కాంగ్రెసు విషపు చెట్టు అని, ఆ అవినీతి విషపు చెట్టు కొమ్మనే వైయస్ జగన్ అని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా వైయస్ జగన్‌పై కాంగ్రెసు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శంచారు. జగన్‌కు విపరీతంగా డబ్బులు వచ్చాయని, వాటిని ఏం చేయాలో తెలియడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పెద్దలు పేదల సొమ్మును పందికొక్కుల్లా దోచుకుని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం పెరిగితేనే అవినీతిపరులు దారికి వస్తారని ఆయన అన్నారు. ఏడేళ్లలో పేద ప్రజల కోసం కాంగ్రెసు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సబ్జెక్టు లేకున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒంటి నిండా అహంకారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు తాము అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెనకబడిన ప్రాంతాలు ఎవరి హయాంలో అభివృద్ధి చెందాయో తేల్చడానికి కాంగ్రెసు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

English summary
TDP president Chandrababu Naidu lashed out at YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X