అనుచరులే టిడిపి కృష్ణా జిల్లా నేత బాలరామకృష్ణను మట్టు బెట్టారు

మృతుని భార్య చల్లపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. హతుడు గతంలో వక్కలగడ్డ సర్పంచిగా కూడా పనిచేశారు. వక్కలగడ్డలో రెండువర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు 1994 నుంచి కొనసాగుతున్నాయి. తెలుగుదేశం వర్గానికి ప్రస్తుతం తాతినేని బలరామకృష్ణ నాయకత్వం వహిస్తున్నారు. సీపీఐకి చెందిన వారు ప్రత్యర్థి వర్గంగా ఉన్నారు. 1997 నుంచి ఇరువర్గాలు పరస్పరం హత్యలు చేసుకున్న దాఖలాలు లేకపోలేదు. బలరామకృష్ణపై ఇది వరకు రెండుసార్లు హత్యాయత్నం జరిగింది.
తెలుగుదేశం నాయకుడు నానిని కూడా పోలీసులు విచారించారు. అయితే హత్యలో ఆయన పాత్ర లేదని పోలీసులు చెబుతున్నారు. ఇసుక మాఫియా కారణంగానే బలరామకృష్ణ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications