వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిమికోట్‌కు చేరుకున్న మంత్రి కన్నా లక్ష్మినారాయణ బృందం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanna Laxmi Narayana
ఖాట్మండు‌: చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బృందం సురక్షితంగా సిమికోట్‌ చేరుకుంది. రెండు హెలికాప్టర్లలో ఈ బృందం నేపాల్‌ టిబెట్‌ సరిహద్దుప్రాంతమైన హిల్సానుంచి సిమికోట్‌కి చేరుకుంది. ఉదయం వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల హెలికాప్టర్లు హిల్సా వెళ్లడం ఆలస్యమైంది. కన్నా లక్ష్మీనారాయణ, శానససభ్యుడు అవంతి శ్రీనివాస్‌తో పాటు 14 మంది మానస సరోవరం యాత్రకు వెళ్లి తప్పిపోయారు. దీంతో ఆదివారం సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చైనా భూభాగంలోని హిల్సా ప్రాంతంలో వారిని దింపేసి సదరన్ ట్రావెల్స్ వెళ్లి పోయింది. సాయంత్రం వరకు వారు మళ్లీ రాలేదు. అయితే మౌంట్ కైలాష్‌కు వెళ్లాలంటే అక్కడి నుండి గుర్రాల ద్వారా వెళ్ల వలసి ఉంటుంది. మౌంట్ కైలాష్ వెళ్లే పరిస్థితులు లేకుంటే వారిని వెనక్కి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇందులో తమ తప్పేమీ లేదని సదరన్ ట్రావెల్స్ ప్రతినిధులు అంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ తన పర్యటనను పొడిగించుకున్నారని చెప్పారు. సిమీకోట్ నుంచి కన్నా లక్ష్మినారాయణ బృందం ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకుంటుంది.

English summary
Minister Kanna Laxminarayana and MLA Avanthi Srinivas reached Simikot by helicopters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X