వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటికి డబ్బు మదం, జగన్ సాక్షిలో పెట్టుబడులు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతం సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో పెట్టుబడులను లగడపాటి రాజగోపాల్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లగడపాటి రాజగోపాల్ జగన్ వైపో, కాంగ్రెసు వైపో తేల్చుకోవాలని ఆయన అన్నారు.

సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. అక్రమ మైనింగ్‌పై తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. మైనింగ్ కార్యకలాపాల్లో గిరిజనులను భాగస్వాములను చేయాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Congress Telangana region leader V hanumanth Rao made comments against his party Seemandhra MP Lagadapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X