వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఎన్ఆర్ఐ జంట భారీ కుంభకోణం: రూ.2070 కోట్ల స్కామ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Reddy Allen-Padma Allen
న్యూయార్క్: అమెరికాలో సుమారు 460 మిలియన్ల భారీ కుంభకోణంలో భారత సంతతికి చెందిన అమెరికా జంట అభియోగాలు ఎదుర్కొంటుంది. సుమారు 2070 కోట్ల భారీ కుంభకోణం కేసులో రెడ్డి అలెన్, పద్మ అలెన్ జంటపై అభియోగాలు నమోదయ్యాయి. వారు తీవ్రమైన మోసానికి పాల్పడ్డట్టు అభియోగం ఉంది. అంతేకాకుండా తమ ప్రయోజనాల కోసం లంచాలు కూడా ఇచ్చారంట. మున్సిపల్ సిబ్బంది జీతభత్యాల వ్యవస్థ ఆధునికీకరణకు న్యూయార్క్ నగర మేయర్ మైకెల్ బ్లూంబర్గ్ యంత్రాంగం చేపట్టిన సిటీలైమ్ ప్రాజెక్టులో ఈ కుంభకోణం వెలుగు చూసింది.

అలెన్ దంపతులకు చెందిన టెక్నోడైన్ కంపెనీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉప కాంట్రాక్టు దక్కించుకుందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అలెన్ దంపతులు తమ కంపెనీ వేగంగా వృద్ధి చెందుతున్నట్లుగా చూపారు. కానీ వారు దాదాపు రూ.70 కోట్ల మేర లంచాలు ఇచ్చి అధికంగా బిల్లులు చేయించుకొని పెద్ద సంఖ్యలో అక్రమ ఉప కాంట్రాక్టులు ఇచ్చినట్లు మాన్ హటన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన అభియోగాల్లో పేర్కొన్నారు. రూ.2700 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు తాజా కుంభకోణం వల్ల కళంకితమైనదని విచారణ సంఘం వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరిలో భారత్‌కు వెళ్లిన అలెన్ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాఫ్తు అధికారులు అనుమతి కోరారని మాన్ హటన్ అటార్నీ జనరల్ తెలిపారు.

English summary
Reddy Allen and Padma Allen have been indicted on federal fraud and kickback charges in relation to the scandals surrounding mayor Michael Bloomberg administration's CityTime project, intended to modernise the municipal payroll system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X