హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడేళ్లలో అంతా మాయం, రాష్ట్రాన్ని దోచిన వారిని రక్షిస్తోంది!: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఏడేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం మీడియా సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పరులను, అక్రమార్కులను వదిలి పెడుతుందని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో రాజకీయ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. మైనింగ్ మాఫియాకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయన్నారు. ఏడేళ్లలో రాష్ట్ర సంపదను మొత్తాన్ని దోచారని అన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అందరూ పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అవినీతి కోరల నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు వచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. అయితే ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావడంలో తప్పు లేదన్నారు. అవినీతే దేశానికి పెద్ద ముప్పు అన్నారు. అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝులిపించాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అవినీతిపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అవినీతిపై అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అన్నారు. అవినీతిని ఇప్పుడు నిర్మూలించక పోతే ఇంకెప్పుడూ నిర్మూలించ లేమన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేయడం శోచనీయం అన్నారు.

English summary
TDP chief Chandrababu Naidu said today that corruption is the big issue of country. He suggested government to take action on corruptionists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X