హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ శవ రాజకీయాలు: టిడిపి, జై తెలంగాణ, జై చంద్రబాబు పేరుతో కరపత్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కొన్ని పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్,గురువారం తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. గురువారం తెలంగాణ టిడిపి ఫోరం ఓ లేఖను విడుదల చేశారు. అందులో జై తెలంగాణ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ టిడిపి ఫోరం ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య జయశంకర్ మృతితో కొందరు శవ రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. శవరాజకీయాలు చేస్తున్న వారితో తగాదాలు ఇష్టం లేకనే జయశంకర్ భౌతికాయాన్ని చూడలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని వారు స్పష్టం చేశారు. జయశంకర్ అందరివాడు అన్నారు. అయితే కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం జయశంకర్ ఓ పార్టీకి చెందిన వాడుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో తెలంగాణ తెచ్చేటి, ఇచ్చేటి కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని టార్గెట్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Telugudesam party leaders blamed TRS in pro.Jayashankar issue. They said Jayashankar is not related to one party. he is Telangana people man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X