హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కదిలిస్తాం: నారా చంద్రబాబు నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించే విధంగా ఆందోళనలు చేపడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆధివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని అన్నారు. స్వామినాథన్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతు నష్టపోవడానికి వీల్లేదని ఏ పంట వేసినా లాభసాటిగా ఉండాలని అన్నారు.

రాష్ట్రస్థాయిలో ధరల నిర్ణాయక సంఘాలు ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినతిపత్రాలు ఇస్తామని వెల్లడించారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని తెలియజేశారు. వ్యవసాయ ఖర్చులు గత కొన్నాళ్లుగా పెరిగాయన్నారు. అయితే అందుకు అనుగుణంగా ధరలు పెరగడం లేదన్నారు. రైతులకు విత్తన పంపిణీ ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తుందన్నారు.

ధాన్యం ధరలపై ఓ కమిటీని ప్రభుత్వం వేయాలన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. కాని రైతులను నష్టం కలిగించరాదన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు.

English summary
TDP president Nara Chandrababu Naidu blamed Congress party. He organiged a all party meeting on farmers and agriculture issue. After meeting he talk with media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X