కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీశైలం ట్రస్టులో విభేదాలు: చైర్మన్‌పై అవిశ్వాసానికి సభ్యుల మంతనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srisailam Trust
కర్నూలు: పవిత్ర పుణ్యస్థలం శ్రీశైలం పాలకవర్గంలో విభేదాలు పొడసూపాయి. శ్రీశైలం పాలకవర్గాలు రెండు భాగాలుగా విడిపోయాయి. పాలకవర్గ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావుపై కార్యవర్గంలోని ఏడుగురు సభ్యులు అవిశ్వాసం పెట్టేందుకు సన్నద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గం ఏడునెలల క్రితం ఏర్పడింది. పాలకవర్గం ఏడు నెలల క్రితం ఏర్పడినప్పటికీ ఆరు నెలల క్రితమే అసంతృప్తి బయట బడింది. చైర్మన్ ఇమ్మిడిశెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల ధ్వజస్థంభం ప్రతిష్టాపన చేసిన సమయంలోనూ విభేదాలు పొడసూపినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలలుగా చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై విసిగిపోయిన ట్రస్టులోని ఏడుగురు సభ్యులు సోమవారం రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అవిశ్వాస తీర్మానం అంశం దేవాదాయశాఖలో ఉందా లేదా అనే విషయంపై ఏకమైన ఏడుగురు సభ్యులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ దేవాదాయశాఖలో అవిశ్వాస తీర్మానం ఉంటే వారు అందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా అసమ్మతి సభ్యులతో ట్రస్టు చైర్మన్, ఈవో రహస్యంగా మాట్లాడినట్లు సమాచారం.

English summary
It seems, differences take place in Srisailam trust board. Seven trust members, who opposing chairman were met secretly today. They are thinking to produce no confidence vote on chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X