హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి-కాంగ్రెసు నేతలకు డెడ్ లైన్ అయిపోయింది: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు తాము ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయిందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తాను టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు 25 వరకే డెడ్ లైన్ విధించామని చెప్పారు. వచ్చే నెల జూలై 2వ తేదిన తెలంగాణ ఉద్యమంపై భవిష్యత్తు ప్రణాళికకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. 2న తెలంగాణ జెఏసి సమావేశం అవుతుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 14 ఎఫ్ రద్దుపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 14ఎఫ్ తొలగించకుంటే ఉద్యోగులు మళ్లీ సహాయ నిరాకరణకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల న్యూఢిల్లీ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. వారు అంత దూరం వెళ్లి తెలంగాణపై నిర్ణయం కాకుండా ప్రాంతీయ కమిటీని మోసుకు వచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో పోలీసు బలగాలను చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram said today that JAC dead line is completed on 25th to Telangana congress leaders for resigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X