చంద్రబాబును అప్పుడే ప్రజలు నమ్ముతారు: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టిడిపి నేతలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేయిస్తేనే ప్రజలు వారిని నమ్ముతారని అప్పటి వరకు నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీ నుండి బహిష్కరించబడిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హెచ్చరించారు. గురువారం ఆయన కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూలై మొదటి వారంతో తెలంగాణ కోసం తాను చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని కెకెను కోరానని చెప్పారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించారన్నారు.

తెలంగాణ కోసం విడివిడాగా ఉద్యమిస్తే లాభం లేదని నాగం అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ఉద్యమించాలని అన్నారు. తెలంగాణపై స్పష్టత ఉన్న నేతలతో తాము భేటీ అయి దీక్షకు మద్దతు కోరుతున్నట్టు చెప్పారు. తెలంగాణ టిడిపి నేతలు బాబుతో అనుకూల ప్రకటన ఇప్పించకుంటే వారిని అంటరాని వారిగా చూస్తామని హెచ్చరించారు. కాగా అనంతరం నాగం, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను కలిసి ఆయన మద్దతునూ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+