ప్రజారాజ్యం నేతకూ కిలాడీ లేడీ దీపికా రెడ్డి గాలం?
పరిచయం చేసుకునేటప్పుడు తాను డాక్టర్ను అని, లాయర్ను అని యువకులకు చెబుతుంది. సందీప్తో కూడా తాను డాక్టర్ను అని చెప్పింది. కానీ దీప చదివింది పదో తరగతే. సందీప్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. అయితే తాను ఓ అనాథ శరణాలయం స్థాపిస్తున్నానని అందుకు కొంత డొనేషన్ కావాలని చెప్పింది. సందీప్ ఆమెకు సుమారు 14 లక్షల రూపాయల వరకు గుంటూరు బ్యాంకులో ఆమె అకౌంట్ పేరిట వేశాడు. తనకు కాబోయే భార్యను చూడాలనుకున్న సందీప్ అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదులోనే ఉంటున్న దీపకు ఫోన్ చేశాడు. కానీ నో రెస్పాన్స్. చాలాసార్లు ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఫలితం లేదు.
దీంతో తాను మోసపోయానని భావించిన సందీప్ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఐడి పోలీసులు కూడా ఆన్ లైన్లో దీపతో పరిచయం పెంచుకొని వల వేసి పట్టుకున్నారు. దీప తాను మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఇలా పెళ్లి పేరుతో యువకులను ఆన్ లైన్లో ఎరవేసి డబ్బులు సంపాదించి విచ్చలవిడి జీవితాన్ని గడుపుతుండేది. గుంటూరులోని ఆమె ఇంటిలో అత్యధునిక ఫర్నీచర్ ఉన్నాయి. కాగా గురువారం సాయంత్రం దీపను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు 6వ తారీఖు వరకు రిమాండ్ విధించింది.