హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామాల్లో తిరగనివ్వం: నేతలకు కోదండరామ్ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయని తెలంగాణ రాజకీయ నేతలను గ్రామాల్లో తిరగనివ్వకూడదని కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ హెచ్చరించింది. రాజీనామాలకు పెట్టిన గడువు ఇప్పటికే ముగిసిందని, ఆ గడువు పెంచే ఆలోచన లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన అన్నారు.

తెలంగాణకు ప్రత్యేక మండళి, ప్యాకేజీల వంటి వాటికి అంగీకరించేది లేదని తెలంగాణ జెఎసి స్పష్టం చేసింది. అటువంటి ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోదానికి అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ జిల్లాల్లో వంటావార్పూ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన కూడా జెఎసి చేస్తోంది.

English summary
Telangana JAC warned Telangana public representatives that they will not allow them in villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X