ఢిల్లీ పర్యటనపై జానారెడ్డితో విభేదిస్తున్న కోమటిరెడ్డి

2009 డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు. మీడియా అనవసరంగా టి-కాంగ్రెసును రెచ్చగొడుతుందని అది సరికాదన్నారు. తెలంగాణ నుండి 11 మంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని సూచించారు. టిడిపి నేతలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు సామాన్య కార్యకర్తగా సోనియా పోటోతో తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణ ఇవ్వడమా, రాజీనామాలు ఆమోదించడమా అధిష్టానం ముందు రెండో ఉన్నాయని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజలు, నేతలకు ఆత్మగౌరవం ఉందన్నారు. సోనియాపై నమ్మకం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications