వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ పర్యటనపై జానారెడ్డితో విభేదిస్తున్న కోమటిరెడ్డి
2009 డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు. మీడియా అనవసరంగా టి-కాంగ్రెసును రెచ్చగొడుతుందని అది సరికాదన్నారు. తెలంగాణ నుండి 11 మంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని సూచించారు. టిడిపి నేతలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు సామాన్య కార్యకర్తగా సోనియా పోటోతో తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణ ఇవ్వడమా, రాజీనామాలు ఆమోదించడమా అధిష్టానం ముందు రెండో ఉన్నాయని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజలు, నేతలకు ఆత్మగౌరవం ఉందన్నారు. సోనియాపై నమ్మకం ఉందని చెప్పారు.
Comments
komatireddy venkat reddy jana reddy telangana congress కోమటిరెడ్డి వెంకట రెడ్డి జానారెడ్డి తెలంగాణ కాంగ్రెసు
English summary
Komatireddy Venkat Reddy was opposed Jana Reddy Delhi tour. Komatireddy thinking that delhi tour after high command perfect statement.
Story first published: Monday, July 4, 2011, 13:58 [IST]