కాంగ్రెసే దోషి: హైకమాండ్పై పొన్నం తిరుగుబాటు

కాగా తాను కాంగ్రెసు పార్టీ దోషి అనలేదని ప్రజల అభిప్రాయం అది అని తాను చెబుతున్నానని ఓ టీవి ఛానల్లో మాట్లాడుతూ అన్నారు. ఆ దోషిత్వాన్ని తొలగించుకోవడానికే తాము అధిష్టానంతో పోట్లాడుతున్నామన్నారు. తెలంగాణ ఇస్తుందని కాంగ్రెసు పార్టీపై నమ్మకం ఉందన్నారు. అందరి సహకారంతో తెలంగాణ సాధిస్తామని చెప్పారు. మీడియా కథనాలు ప్రసారాలు చేయడంలో సంశయమనం పాటించాలని సూచించారు. అవాస్తవ విషయాలు పక్కన పెట్టి మీడియా నిజాలు చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీని అగౌరవపరిచే విధంగా తాను మాట్లాడలేదన్నారు. కాగా పొన్నం రాజీనామా ప్రతిపాదనలపై టిఎన్జీవో నేత దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ ప్రజల నుండి డిమాండు వచ్చినప్పుడు స్పందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications