రాష్ట్రపతి పాలన దిశగా కాంగ్రెసు కదలిక

కాగా, తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల వద్ద కాంగ్రెసు అధిష్టానం నాలుగు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, రాష్ట్రపతి పాలన అనే రెండు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును తాము అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ నాయకులు అంటున్నారు. దీంతో నాలుగో ప్రతిపాదన రాష్ట్రపతి పాలనే అంతిమం కానుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్పై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది. శ్రీకృష్ణ కమిటీని వేసి నివేదిక తెప్పించుకున్న తర్వాత, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా మళ్లీ ఏకాభిప్రాయ సాధన, విస్తృత స్థాయి సంప్రదింపులు అని అధిష్టానం అనడాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications