తెలంగాణే లక్ష్యం, మెట్టు దిగబోమన్న జానా రెడ్డి

తెలంగాణ ప్రజల మనోభావాలను, ప్రజాప్రతినిధుల రాజీనామాల విషయాన్ని, తాజా పరిణామాలను అధిష్టానం దృష్టికి తేవడానికే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్టానం వెంటనే చర్చలు ప్రారంభిస్తుందని అనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇక కాలయాపన తగదని తాము అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు, వాస్తవాలను పార్టీ అధిష్టానానికి తెలియజేయడానికి తాము రాజీనామాలు చేశామని ఆయన అన్నారు.
తమను ప్రజలు నమ్మలేని స్థితి వచ్చిందని, తెలంగాణలో పర్యటించలేని వాతావరణం ఉందని, ప్రజలు తమపై ఒత్తిడి పెంచుతున్నారని, ఈ విషయాలను అధిష్టానానికి చెప్పాలని అనుకున్నామని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె. కేశవ రావు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications