వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరు జిల్లాలో మంత్రి జైపాల్ రెడ్డి శవయాత్రలు

జిల్లాలోని కొడంగల్, కొల్లాపూర్, ధరూర్, వీపెనగండ్ల, నారాయణపేట్, కొత్తూరు, కేశంపేట మండలాల్లో పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ ఆందోళనకారులు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. శవయాత్రలు నిర్వహించారు. మహబూబ్నగర్లో ఆయనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. జైపాల్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అగ్రనేతల వరుసలో ఉన్న జైపాల్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజీనామా చేయకపోతే ప్రజలు జైపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.