టిడిపి సీమాంధ్ర నేతల వ్యూహాత్మక మౌనం

తమ మౌనం రాష్ట్ర విభజనకు ఆమోదంగా తీసుకోకూడదని, తగిన సమయంలో తాము రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముందుకు వస్తామని తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు వంటివారు అంటున్నారు. అవసరమైతే తాము రాజీనామాలు చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అడ్డుకోవడానికి వారు పెద్ద యెత్తున ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రజాప్రతినిదుల రాజీనామాల వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి రాజీనామాలను తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహం పని చేయని స్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కూడా తమతో ఉంటారని తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ చెప్పారు. దీంతో తెలంగాణలో వారికి వ్యతిరేకత ఉండదు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నప్పటికీ రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది. తాజా పరిణామాలు తెలంగాణలో పార్టీకి ప్రయోజనకరంగా మారిన పరిస్థితిలో సీమాంధ్ర నేతలు మౌనంగా ఉండడం మంచిదని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications