వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సంప్రదింపుల అంశం కాదు: కె. కేశవరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా, వద్దా అనే అంశంపై సంప్రదింపులు ఉండవని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు చెప్పారు. తెలంగాణపై తాము వెనక్కి తగ్గేది లేదని, రాజీనామాలను ఉపసంహరించుకోబోమని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం ఆయన శనివారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం కార్యాచరణను రూపొందించి అమలు చేయడానికి రాజీనామా చేసిన ప్రతినిధులతో ఏ కోర్ కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నాడు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కోర్ కమిటీని వేస్తామని ఆయన చెప్పారు.

రాజీనామాలు చేయడం కన్నా మించిన ఉద్యమం ఉండదని ఆయన అన్నారు. రాష్టాన్ని సాధించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. తాము నమ్మే విధంగానే కాకుండా ప్రజలు, న్యాయనిపుణులు నమ్మే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తేనే తాము రాజీనామాలను ఉపసంహరించుకుంటామని ఆయన చెప్పారు. తమను శంకించవద్దని, తమను కించపరచవద్దని, తమ వ్యవహారశైలినీ వ్యాఖ్యలనూ వక్రీకరించవద్దని ఆయన మీడియాను కోరారు. తాము తెలంగాణ రాజకీయ జెఎసిలో చేరబోమని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో సమన్వయం సాధించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోతామని ఆయన అన్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించిన వైఖరిని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి వ్యతిరేకించారు.

English summary
Congress Telangana region senior leader K Keshav Rao said that Telangana issue is not negotiable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X