తెలంగాణపై స్పష్టంగా చెప్పని కొండా సురేఖ

వైయస్సార్ లేని మంత్రివర్గంలో ఉండబోనని తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని, రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన ఆదరణ ఉందో, వరంగల్లు జిల్లాలో తనకు అంత ఆదరణ ఉందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వైయస్సార్ అడ్డుపడ్డారనే దుష్ప్రచారం సాగుతోందని ఆమె అన్నారు. అప్పుడు కాంగ్రెసు పార్టీ పోరాటంలో కూడా లేదని ఆమె అన్నారు. ఇప్పుడు తెలంగాణకు ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం, కాంగ్రెసు తెలంగాణను ఇవ్వాల్సి ఉందని, కాంగ్రెసు పార్టీ తెలంగాణను తేవాల్సి ఉందని ఆమె అన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డారంటూ వైయస్సార్ను చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎగిసిపడుతోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications