హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, చంద్రబాబు దొందూ దొందే: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దొందూ దొందేనని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై వైయస్ జగన్ స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ ఒక ఆకులో చదివినవాళ్లేనని ఆయన అన్నారు. స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలంగాణవాళ్లు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల కోసం, సీట్ల కోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణను వాడుకుంటున్నారని, చంద్రబాబుతో ఉన్నవాళ్లు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ రాజకీయ నాయకులు పార్టీలపరంగా విడివిడి ఉద్యమాలు చేయడం సీమాంధ్ర కుట్రలో భాగమని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర కుట్రలో తెలంగాణ రాజకీయ నాయకులు పావులుగా మారుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ నాయకులు కలిసి తెలంగాణ కోసం పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఒకే లక్ష్యం కోసం రాజీనామాలు చేసిన నాయకులు ఒక చోట ఎందుకు సమావేశం కాలేకపోతున్నారని ఆయన అడిగారు. తమకు పార్టీలు లేవు, తాము పిలుస్తాం రావాలని ఆయన అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా నాటకాలు కట్టపెట్టాలని ఆయన కోరారు. ఇప్పటికీ రాజీనామాలు చేయనివారు పదవులు వదులుకుని ఉద్యమ బాట పట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఒకే మాట, ఒకే బాటగా పనిచేయాలని ఆయన కోరారు.

English summary
Suspended TDP MLA Nagam Janardhan Reddy criticised YSR Congress party president YS Jagan stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X