సిఎంకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెసు క్యాడర్ షాక్

కాగా, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయడంతో తెలంగాణవాదుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని మంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో ఆటంకాలు కల్పిస్తారనే ఉద్దేశంతో పోలీసులు పలువురు తెలంగాణవాదులను ముందస్తు చర్యగా అరెస్టు చేశారు. వారిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్కు తరలించారు.












Click it and Unblock the Notifications