జగన్ మమ్మల్ని కాపీ కొట్టాడు: ఎర్రంనాయుడు

వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విభజన చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు విప్పాలని, లేకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్లో తుడిచి పెట్టుకుపోతుందని ఆయన అన్నారు. కెసిఆర్, జగన్ పరస్పర అవగాహనకు వచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ఆయన అన్నారు.
ప్రస్తుత వేర్పాటువాదానికి ప్రధాన కారకుడు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డే ప్రధాన కారకుడని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జైపాల్ రెడ్డి వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి రకరకాలుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీ కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications