వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్ ప్రమాదంలో 40 మంది పిల్లలు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangladesh Flag
ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ సాకర్‌ టోర్నమెంటుకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ట్రక్కు కాలువలోకి దూసుకుకుపోయింది. దీంతో ప్రమాదం సంభవించింది. వాహనంలో 8 నుంచి 12 ఏళ్ల వయసు గల 60 మంది విద్యార్థులు ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసు అధికారి వెల్లడించారు.

పిల్లలు ట్రక్కులో పాడుతూ నృత్యాలు చేస్తున్నారని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. రోడ్డు బురదగా ఉండడంతో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయిందని అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మునిగిపోయిన ట్రక్కులో చిక్కుకుపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది శవాలను వెలికి తీశారు. ఉత్సవాల సందర్భంగా, పండుగల సందర్భంగా తొందరగా వెళ్లడానికి బంగ్లాదేశ్‌లో ట్రక్కులను వాడుతుంటారు. ప్రమాదం స్థలి వద్ద పెద్ద యెత్తున ప్రజలు గుమికూడారు.

English summary
A vehicle packed with schoolchildren returning home from a soccer tournament crashed into a canal in southeastern Bangladesh on Monday, killing at least 40, a police official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X