జగన్ తెలంగాణలో తిరగలేరు, పార్టీలో ఉండను: గోనె

ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే వైయస్ జగన్కు పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. ఓదార్పు యాత్రను తెలంగాణ జిల్లాల్లో నిర్వహించడం కష్టమవుతుందని ఆయన అన్నారు. అందువల్ల తెలంగాణపై జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయక పోతే తాను పార్టీలో కొనసాగలేనన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని, తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ తాము కాదని వైయస్ జగన్ ఇటీవల పార్టీ ప్లీనరీ సమావేశంలో చెప్పారు. తెలంగాణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications