వైయస్ జగన్పై రాజకీయ కుట్ర లేదు: బొత్స

ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజా జీవితంలో ఉన్నవారు విచారణ ద్వారా తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుందని, గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తాను సిబిఐ విచారణ వేయించుకున్నానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయమేమీ జరగలేదని ఆయన అన్నారు. గతంలో కన్నా కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యమే ఉందని ఆయన అన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో రాష్ట్ర పరిస్థితుల ప్రభావం ఏమీ లేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్న కిశోర్ చంద్రదేవ్కు ఆయన ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రేపు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications