ముంబైలో వరుస బాంబు పేలుళ్లు, 21 మంది మృతి

ముంబైలో జరిగిన మూడు పేలుళ్లలో 200కిపైగా గాయపడినట్లు సమాచారం. ముంబైలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో అన్ని నగరాలను అప్రమత్తం చేశారు. ఢిల్లీ, హైదరాబాదు వంటి నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది తెలియడం లేదు. పాక్ ఉగ్రవాదులు గానీ అండర్ వరల్డ్ గానీ ఆ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మూడు పేలుళ్లు కూడా టిఫిన్ బాంబులేనని తెలుస్తోంది. అందువల్ల ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఇందులో ఉండవచ్చునని అంటున్నారు. పేలుళ్లలో 60 మంది దాకా మరణించారని అధికారులు చెప్పారు. మూడు పేలుళ్లలోనూ ఐఇడి వాడినట్లు హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి. ముంబైకి జాతీయ దర్యాప్తు బృందాన్ని పంపించారు. ఢిల్లీ దర్యాప్తు చేసి, ఫొరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తోంది.
ముంబై పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసరంగా సమావేశమైంది. ముిబైకి ఢిల్లీ నుంచి బిఎస్ఎఫ్ విమానంలో ఎన్ఎస్జి బలగాలు బయలుదేరాయి.












Click it and Unblock the Notifications