వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేలుళ్లకు టైంబాంబులు వాడారు: చిదంబరం
పేలుళ్లలో 131 మంది గాయపడ్డారని, వారిలో 23 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పేలుళ్లలో 17 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 31 నెలల్లో ముంబైలో ఇది రెండో ఘటన అని ఆయన అన్నారు. గాయపడినవారు 11 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదని ఆయన అన్నారు. ఏ సంస్థ కూడా దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని ఆయన చెప్పారు. వదంతులు నమ్మవద్దని ఆయన చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అరెస్టు చేస్తే చెబుతారని ఆయన అన్నారు.
Comments
English summary
Home Minister P Chidambaram is holding a press conference in Mumbai on the three serial blasts that killed 17 and injured more than 130 people last evening.
Story first published: Thursday, July 14, 2011, 10:13 [IST]