వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్లకు టైంబాంబులు వాడారు: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
ముంబై: ముంబై పేలుళ్లకు టైంబాంబులు వాడారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన టైంబాబులను వాడినట్లు, అవి రిమోట్ కంట్రోల్ బాంబులు కావని ఆయన తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనా స్థలాల్లో కీలక ఆధారాలు లభించాయని ఆయన అన్నారు. పేలుళ్లపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. సంఘటనా స్థలాలను సందర్శించి, బాధితులను పరామర్శించడానికి ఆయన ముంబై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారమే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారని ఆయన అన్నారు. గాయపడినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.

పేలుళ్లలో 131 మంది గాయపడ్డారని, వారిలో 23 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పేలుళ్లలో 17 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 31 నెలల్లో ముంబైలో ఇది రెండో ఘటన అని ఆయన అన్నారు. గాయపడినవారు 11 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదని ఆయన అన్నారు. ఏ సంస్థ కూడా దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని ఆయన చెప్పారు. వదంతులు నమ్మవద్దని ఆయన చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అరెస్టు చేస్తే చెబుతారని ఆయన అన్నారు.

English summary
Home Minister P Chidambaram is holding a press conference in Mumbai on the three serial blasts that killed 17 and injured more than 130 people last evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X