ముంబయిలో ముష్కరమూకుల దాడిని ఆమెరికా రాష్ట్ర్ర కార్యదర్శి హిల్లరి క్లింటన్ తీవ్రంగా ఖండించారు, వచ్చే వారంలో భారత్ లో పర్యటించనున్న తమ బృందం ఉగ్రవాదం పై పోరుకు భారత్కు అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. డాబర్ వెస్ట్, జావేరీ బజార్, ఓపెరా హౌస్ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో మరణించిన, క్షతగాత్రులైన కుటుంబాలకు హిల్లరి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రక్తపాతాన్ని సృష్టిస్తూ అనైతికి చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏమి సాధించలేరని హెచ్చరించారు. ఉగ్రవాద చర్యలు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయులు ప్రస్తుతం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారన్నారు. తమ పౌరులు శాంతి భద్రతలకు ఏటువంటి హాని కలగకుండా నిరంతరం పర్యవేక్షణను ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. భారత్, ఆమెరికాల మధ్య సరళీకృత వ్యూహాలను చర్చించేందుకు హిల్లరి ఈ నెల 19,20 తేదీల మధ్య న్యూ ఢీల్లి , చెన్నైలలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
US secretary of state Hillary Clinton on Wednesday condemned the serial blasts in Mumbai and said she would be travelling to India next week as scheduled to reaffirm the US' "commitment to the shared struggle against terrorism".