తమ ద్వీపాల అడవులలో క్రమేణా నివాస స్ధావరాలను కోల్పోతూ అంతమైపోతున్న ఏనుగుల సంఖ్యను నియంత్రించే ధ్యేయంగా శ్రీలంక ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఏనుగులకు సెన్సస్ మొదలుపెట్టింది. ఈ సెన్సస్ ఆగస్టు 13 పౌర్ణమి నాటినుండి ప్రారంభించి రెండు రోజులలో ముగుస్తుందని, పౌర్ణమి వెన్నెల వెలుగులో ఏనుగులు సరస్సులలో నీటిని తాగటానికి వచ్చినపుడు వాటి లెక్కలు వేయబడతాయని వైల్డ్ లైఫ్ అధికారి చంద్రవంశ పతిరాజ తెలిపారు. ఈ గణన లో గుంపుల సమూహాలు, ఆడ ఏనుగులు, మగ ఏనుగులు, గున్న ఏనుగులు, టస్కర్లు మొదలైన కేటగిరీలలో లెక్కించబడతాయన్నారు. గణన పూర్తయిన తర్వాత అవసరం మేరకు ఏనుగుల జనాభా నియంత్రణకుగాను చట్టాలు కూడా చేయబడవచ్చన్నారు. ఏనుగుల సంరక్షణకుగాను తాము చేపట్టే విధానాలు, ప్రాజెక్టులు ఎంతో సహకరించగలవని ఆయన తెలిపారు.
Elephants will be counted as they come to drink from water holes, reservoirs and tanks. The census can be used for many years for the policymakers and government authorities.