వల్లభనేని వంశీ అనచురుడు మోహన్ హత్య?

Prakasam bridge
విజయవాడ: తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు వడ్లమూడి మోహన్ హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని శవం విజయవాడ రోడ్డుపై పడి ఉంది. అతని వాహనం కూడా అక్కడే ఉంది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో సిగరెట్ కోసమని బయటకు వెళ్లిన వడ్లమూడి మోహన్ తన గదికి తిరిగి రాలేదు. అతను రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడని కూడా అనుకుంటున్నారు. హత్య కోణంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వడ్లమూడి మోహన్ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. విజయవాడలోని విద్యార్థులను కూడగట్టడంలో అతను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అతని చుట్టూ ఎప్పుడు వంద మంది దాకా ఉంటారు. మూడు నెలల క్రితం విద్యార్థుల మధ్య జరిగిన సంఘటన వల్లనే మోహన్ హత్యకు గురై ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా విజయవాడలో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

వడ్లమూడి మోహన్‌ది హత్యేనని తెలుగుదేశం విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ అన్నారు. మోహన్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. నగర పోలీసు కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరుతామని ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+