వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: విజయనిర్మల

Vijayanirmala
మహబూబ్‌నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మల అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనే తపన వైయస్ జగన్‌లో ఉందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నీరుగారిపోయాయని ఆమె విమర్శించారు. రాజకీయాలు దిగజారాయని, రాజకీయాల్లో విలువలు పడిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసమే జీవించాడని, ప్రజల కోసమే మరణించాడని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చాలా బాధేసిందని ఆమె అన్నారు. తాను, తన కుమారుడు నరేష్, భర్త కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నరేష్‌తో కలిసి ఆమె వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+