తెలంగాణ నేతలను ఢిల్లీకి ఆహ్వానించిన ఆజాద్

తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా ఒకే తాటిపై ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయారనే విమర్శలో నిజం లేదని, ఎవరూ ముఖ్యమంత్రికి అమ్ముడుపోలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నాయకులతో కలిపి సంప్రదింపులు జరపడానికే ఆజాద్ తెలంగాణ నాయకులను ఢిల్లీకి అహ్వానించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నాయకులకు ఇప్పటికే 18వ తేదీన అధిష్టానం పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇరు ప్రాంతాల నేతలను కలిపి ఆజాద్ చర్చలు జరుపుతారా, విడివిడిగా జరుపుతారా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications